ఏపీలో సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 6లక్షల 15వేల మంది పరీక్షలకు హాజరవ్వగా 4లక్షల 14వేల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఫలితాల్లో బాలికలదే పైచేయి. 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదు. ఈ క్రమంలో వచ్చే నెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు రేపటి నుంచే ఫీజు కట్టొచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే.. కొద్ది మార్కుల్లో ఉత్తీర్ణత కోల్పోయిన విద్యార్థులకు ఎస్ఎస్బీ బోర్డు మరో అవకాశం కల్పించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పై పలు సూచనలు చేసింది.
రీకౌంటింగ్ , రీవెరిఫికేషన్పై సూచనలు:
పైన పేర్కొన్న పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్ DEO ఆఫీసులలోని కౌంటర్లలో అందజేయాలి. DGE, A.P (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించరు.
మార్కుల మొత్తం మారిన సందర్భాల్లో సవరించిన మెమోరాండం జారీ చేస్తారు.
రీవెరిఫికేషన్ ప్రాసెస్:
పాఠశాలల హెడ్ మాస్టర్ లాగిన్లో ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల తర్వాత సబ్జెక్ట్ వారీగా మార్కుల మెమోరాండం www.bse.ap.gov.in వెబ్సైట్లో ఉంచుతారు. హెడ్ మాస్టర్ సంబంధిత స్కూల్ లాగిన్ నుంచి స్కూల్ వారీగా మార్కుల మెమోరాండం, వ్యక్తిగత మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ www.results.bse.ap.gov.in నుంచి నేరుగా మార్క్స్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే..
పరీక్ష దరఖాస్తు, ఫీజులను సమర్పించే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.bse.ap.govలో డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ను పొందేందుకు హెడ్ మాస్టర్ ను సంప్రదించవచ్చు. హెడ్ మాస్టర్ డిజిటల్ సంతకం చేసిన మైగ్రేషన్ సర్టిఫికేట్ను కలర్ PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సబ్జెక్ట్ వారీగా మార్క్స్ మెమోరాండమ్తో పాటు దానిని తప్పకుండా అందజేస్తారు. సబ్జెక్ట్ వారీగా మార్కులతో ఒరిజినల్ ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికెట్లు నిర్ణీత సమయంలో అన్ని పాఠశాలలకు అందజేస్తారు. హెచ్ఎమ్ సర్టిఫికేట్పై సంతకాన్ని వెరిఫై చేసి విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికేట్ను అందజేస్తారు.
ఇది కూడా చదవండి: కొడుకును అంగన్వాడిలో చేర్పించిన కలెక్టర్… హ్యట్సాఫ్ అంటున్న నెటిజన్లు!