ముంబయి- మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్డీవ్ గా ఉంటారు. అంతే కాదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వారికి తన వంతు సాయం చేస్తుంటారు ఆనంద్. ఇక వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. కరోనా సమయంలో సోషల్ మిడీయా ద్వార తన దృష్టికి వచ్చిన చాలా సమస్యలపై స్పందించిన ఈ బిజినెస్ మ్యాన్.. కొందరికి ఆర్ధిక సాయం కూడా చేశారు.
ఇక ఇప్పుడు ఓ సరదా ట్వీట్తో ఆనంద్ మహీంద్రా మన ముందుకు వచ్చారు. ముంబయిలోని దాదర్లో ఓ ఫుడ్ కోర్టు ఉంది. ఇక్కడ ఓ వ్యక్తి చాలా వేగంగా దోశలు వేస్తున్నాడు. కేవలం దోశలు వేయడమే కాదు, వాటిని ఫాస్ట్ గా కట్ చేసి, ఒకేసారి పళ్లెంలో వడ్డించి ఇచ్చేస్తున్న తీరు భలేగా ఉంది. దీనికి సంబందించిన వీడియోని స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ అనే ఫుడ్ పేజీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. రోబో సైతం సిగ్గుపడేంతలా వేగంగా పనిచేస్తున్నాడంటూ దోశ మాస్టర్ ను కొనియాడారు. అతన్ని చూసి నేను అలసిపోయానన్న ఆనంద్ మహీంద్రా, అతడు దోశలు వేసే విధానం చూస్తే ఆకలి వేస్తోందంటూ సరదాగా కామెంట్ చేశారు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో మొత్తం 28 సెకన్ల నిడివితో ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియో 24లక్షల వ్యూస్ రాబట్టింది. అన్నట్లు ఈ ఫుడ్ కోర్టులో రజనీకాంత్ స్టైల్ దోశ చాలా ఫేమస్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ రోబో దోశ మాస్టర్ వీడియో మీరు కూడా చూసి ఎంజాయే చేయండి.
This gentleman makes robots look like unproductive slowpokes… I’m tired just watching him…and hungry, of course.. pic.twitter.com/VmdzZDMiOk
— anand mahindra (@anandmahindra) August 17, 2021