సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి షో నుండే భిన్నమైన టాక్ వచ్చినప్పటికీ, టాక్ కి భిన్నంగా రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బ్యాంకు వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, లోన్స్ విషయంలో డబ్బున్నోళ్లకు, పేదలకు మధ్య బ్యాంకులు చూపించే వ్యత్యాసాలను తెరపై ఆవిష్కరించింది.
అదేవిధంగా సినిమాలో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ డైలాగ్ మహేష్ చెప్పడం, ఓ టీ గ్లాస్ సన్నివేశం.. డబ్బున్నోళ్ళు బ్యాంకుల నుండి వేలకోట్లలో తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడం.. లాంటి అంశాలన్నీ సర్కారు వారి పాట చిత్రానికి నెగటివ్ టాక్ తీసుకొచ్చాయని.. ఇదంతా ఏపీ ప్రభుత్వానికి పాజిటివ్ గా చెబుతూ.. ప్రస్తుత విపక్షాలు టీడీపీ, జనసేన పార్టీలను సినిమాలో టార్గెట్ చేశారని టీడీపీ, జనసేన ఫ్యాన్స్ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది.ఈ నేపథ్యంలో సర్కారు వారి పాటకు సంబంధించి వైసీపీ పై వినిపిస్తున్న ట్రోల్స్ పై వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ వెంకట్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “ముందుగా సినిమాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. సినిమాలో మంచి మెసేజ్ ఉంది. ప్రస్తుతం బ్యాంకు వ్యవస్థలో సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ఆవిష్కరించింది ఈ సినిమా. నేను కూడా చూశాను. వాళ్ళేదో రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సినిమా తీశారు. దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి నెగటివ్ చేస్తున్నారు. ఏవైతే మాకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు, వాళ్లకు సంబంధించిన దత్తపుత్రుడు, మీడియా సంస్థలు, పత్రికల వల్లే సర్కారు వారి పాట సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది” అని చెప్పుకొచ్చారు. మరి వైసీపీ నేత వెంకట్ రెడ్డి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.