Singer: ప్రముఖ సౌత్ ఇండియన్ సింగర్ సంగీత సజిత్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆదివారం మరణించారు. కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె తిరువనంతపురంలోని చెల్లెలి ఇంట్లో 46 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సంగీత తెలుగుతో పాటు తమిళం, కన్నడ మలయాళంలో పాటలు పాడారు. నాలుగు భాషల్లో కలిపి దాదాపు 200 పాటలు పాడారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన తమిళ సినిమా ‘రోమియో’లో పాడిదన ‘తన్నైరై కాదలిక్కుమా’ పాట బ్లాక్ బాస్టర్గా నిలిచింది.
2021లో విడుదలైన పృధ్వీరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కురితి’ సినిమాలో చివరగా ఓ పాట పాడారు. తన అద్భుతమైన గాత్రంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితను మెప్పించారు. జయలలిత, సంగీతకు పది సవర్ల బంగారు చైన్ కానుకగా ఇచ్చారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంగీత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. తైకాడ్లోని ‘శాంతి కావడం’ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి : Rashmika: రష్మిక మందన్నా మాజీ ప్రియుడి పెళ్లి.. ఆ హీరోయిన్ ఎవరంటే?