రాజమౌళి.. బాహుబలి ముందు వరకు ఈయన గురించి కేవలం సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదలయ్యిందో.. దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మొగిపోయింది. ఇండస్ట్రీలో ఎవరికైనా అపజయాలు తప్పవు. కానీ రాజమౌళి కెరీర్లో ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ప్లాప్ సినిమా లేదంటే.. ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఇక మార్చి 25న విడుదలైన RRR సినిమాతో మరోసారి రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయనపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ క్రమంలో సీనియర్ నటుడు ఒకరు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి.. ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి వస్తాడని.. తాను పుష్కర కాలం కిందటే ఊహించానని.. ఇప్పుడు అది నిజం అయ్యిందని తెలిపాడు. ఆ వివరాలు..
సీనియర్ హీరో, నటుడు భానుచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలతో భాను చందర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 80, 90ల్లో స్టార్ హీరోగా చక్రం తిప్పిన ఆయన పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. మ్యుజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన భాను చందర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆడియన్స్ను పలకరిస్తున్న ఆయన తాజాగా ఓ టీవీ చానల్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికకర విషయాలను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: దుబాయ్ చేరుకున్న మహేష్ – రాజమౌళి.. అందుకేనా?
‘‘రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని 12 ఏళ్ల క్రితమే చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది కదా. సింహాద్రి సినిమా చేసినప్పుడే రాజమౌళితో ఈ మాట చెప్పాను. నా డబ్బింగ్ సమయంలో ఆయనను పిలిచి ‘‘ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. కానీ మీరు అందుబాటులోకి రారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారు’’ అని చెప్పాను. అంతేకాదు ఆయన దగ్గరి నుంచి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా హిట్ చేయాలనే టెక్నిక్ను చాలామంది నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్ పేపర్లో పెట్టి వండర్ఫుల్ చాక్లెట్ అని అమ్మగలరు. ఇలా ఎంతమంది చేయగలరు. ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. అది రాజమౌళిలో చాలా ఉంది” అని ప్రశంసించారు. కాగా సింహాద్రిలో భాను చందర్ భూమిక తండ్రి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: మరో లగ్జరీ కారు కొన్న రాజమౌళి. ధర ఎంతంటే?
ఇక భాను చందర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మ్యూజిషియన్గా ఉన్న ఆయన అసలు నటుడిగా ఎలా మారారో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంటిబాబు మా నాన్న దగ్గర పనిచేసేవారు. ఆయన కుమార్తె ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరింది. రజనీకాంత్ క్లాస్మేట్ ఆమె. అదే సమయంలో నేను ముంబైకి వెళ్లాను. అక్కడ విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం, చెడు అలవాట్లతో ఆరోగ్యం పాడు చేసుకున్నా. ఇంట్లో ఎంత చెప్పినా వినలేదు. చివరికి అమ్మ ఒత్తిడితో చెన్నై వచ్చాను. ఈ డ్రగ్స్ నుంచి బయటపడేందుకు మా అన్నయ్య నన్ను మర్షల్ ఆర్ట్స్లో చేర్పించాడు. తైక్వాండోతో చెడు అలవాట్లు అన్ని పోయాయి. అలా మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్డ్ సాధించా. ఆ తర్వాత నా కెరీర్ మారిపోయింది’’ అని చెప్పుకొచ్చారు. భాను చందర్ కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: KGF-2 క్లైమ్యాక్స్ లో షాకింగ్ ట్విస్ట్! రాకీ భాయ్ బతికే ఉన్నాడా?