సాధారణంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాకు మధ్య గ్యాప్ లో ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాను పూర్తిచేసి వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం.. మే 12న విడుదల కాబోతుంది. అయితే.. దుబాయ్ వెకేషన్ నుండి రాగానే మహేష్ సర్కారు ప్రమోషన్స్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.
ఇక మహేష్ తదుపరి సినిమాలు త్రివిక్రమ్, రాజమౌళితో చేయనున్నాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమాను ఈ ఏడాదిలోనే పూర్తిచేసే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే.. ఆ తర్వాత రాజమౌళి సినిమా అయ్యేంతవరకు వేరే సినిమాకు డేట్స్ కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మహేష్ – రాజమౌళి కాంబినేషన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ వెళ్లినట్లుగానే రాజమౌళి కూడా దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు.ఇక ఇద్దరూ దుబాయ్ కే వెళ్లేసరికి వీరిద్దరూ వారి సినిమా కథా చర్చల కోసమే వెళ్లి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉండగా.. మహేష్ – రాజమౌళి కాంబినేషన్ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు మాత్రం తారాస్థాయిలో నెలకొన్నాయి. సినీ అభిమానులు ఎప్పటినుండో ఈ కాంబినేషన్ లో సినిమా చూడాలని ఆశిస్తున్నారు. త్వరలోనే ఫ్యాన్స్ కోరిక తీరనుంది. మరి మహేష్ – రాజమౌళి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.