కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. ఇంకా టీకా తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్లు వేసుకోవాలంటూ చైతన్య పరుస్తున్నారు. మాస్కు, భౌతిక దూరం ముఖ్యమని సూచిస్తున్నారు. మరోవైపు ఉద్ధృతి ఎక్కువున్న రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. అయితే ఈ నిర్ణయంపై మాత్రం కొన్ని విమర్శలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే విషయంపై తనదైనశైలిలో స్పందించాడు. తనకు అర్థం కాలేదు అంటూనే.. రాజకీయ నాయకులకు చురకలు అంటించాడు.
I apologise to the political leaders for the below tweet because I just came to know that the political leaders have struck a deal with the Omicron viruses not to infect them till the elections are over 🙏 https://t.co/LJAGbnO7t7
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2021
మొదట తన మనసులో మాటను ట్వీట్ చేసి తర్వాత దానికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఇప్పడు ఆ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కరోనా పెళ్లిళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్లలోనే ఎందుకు వ్యాపిస్తుంది? పొలిటికల్ ర్యాలీలలో ఎందుకు వ్యాపించదు?’ అనే ప్రశ్నను అడిగాడు. ఆ తర్వాత మళ్లీ ‘ఈ కింది ప్రశ్న అడిగినందుకు నన్ను క్షమించండి. నేను తెలుసుకోవాలను కుంటోంది ఏంటంటే.. మీరు ఒమిక్రాన్ తో ఎలా డీల్ చేసుకున్నారు. మీకు ఎన్నికలు అయ్యే వరకు కరోనా రాకూడదని?’ అంటూ రాజకీయ నాయకులకు చురకలు వేశాడు.
I apologise for the below tweet too , because I just came to know that the political leaders were told by God that viruses take a nap between 5 Am and 10 pm 🙏 https://t.co/lBcVgYwUq6
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2021
మరోవైపు నైట్ కర్ఫ్యూ గురించి కూడా గట్టిగానే స్పందించాడు. ‘నా జీవితంలో నాకున్న అతిపెద్ద సందేహం ఏంటంటే.. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5వరకు విధించే రాత్రి కర్ఫ్యూ.. కరోనాను ఎలా కట్టడి చేస్తుంది?’ అని అడిగాడు. దీనిపై కూడా మళ్లీ సెటైర్ వేశాడు. ‘ఈ ట్వీట్ విషయంలోనూ నేను క్షమాపణలు చెబుతున్నాను. రాజకీయ నాయకులకు దేవుడు ఏమైనా చెప్పాడా? వైరల్ ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు పడుకుంటుంది అని?’ అంటూ సెటైర్ వేసేశాడు. రామ్ గోపాల్ వర్మ సంధించిన ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.