తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తెరకెక్కించే ఏ చిత్రం అయినా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. బాహుబలి తో ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. బాలీవుడ్ లో మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ చూసి ఎంతోమంది సెలబ్రెటీలు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాశాంతి పార్టీ స్థాపించిన తర్వాత కేఏ పాల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో బాగా మమేకం అవుతున్నారు. ఆయన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సందర్భంగా ఓ అభిమాని ఆర్ఆర్ఆర్ మూవీ చూశారా అని అడిగారు. అదేం మూవీ.. అయినా ఈ మద్య ఎన్నో రకాల పేర్లతో మూవీలు వస్తున్నాయని అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చాడు. అయినా సినిమాలపై దృష్టి ఆపి సమాజం బాగు పడే విషయాలపై ఆలోచించండి అంటూ కామెంట్ చేశారు. దీంతో సినీ ప్రేమికులకు కాదు సెలబ్రెటీలకు సైతం చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది.. కేఏ పాల్ కి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కేఏ పాల్ స్పందించిన విధానంపై విమర్శలు వస్తున్నాయి. రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. ‘నీ మొహం రా’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి మరో సంచలనం సృష్టించాడు. ఒక్కసారిగా నెటిజన్లు వర్మ చేసిన ఈ కామెంట్ను వైరల్ చేస్తున్నారు.గతంలోనే చాలాసార్లు కే ఏ పాల్ కు సంబంధించిన స్టేట్మెంట్స్ పై సెటైర్లు కూడా వేయడం జరిగింది. ఏ పాల్ లాంటి వారు ఇలా నెగెటివ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Nee Moham raa ! pic.twitter.com/KGrAzqwuXG
— Ram Gopal Varma (@RGVzoomin) March 31, 2022