Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనబడుతోంది. ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి నటించిన ఆయన.. ‘‘ఆచార్య’’సినిమాలో తండ్రి మెగాస్టార్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్, చెర్రీల కాంబినేషన్లో కూడా ఓ మల్టీస్టారర్ ఉండబోతోందని చాలా ఏళ్ల నుంచి ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో అబ్బాయ్ రామ్చరణ్ కలిసి నటించే విషయంపై క్లారిటీ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘‘ భవిష్యత్తులో బాబాయ్ పవన్ కల్యాణ్తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తా.
ఆ సినిమాకు నేనే ప్రొడ్యూషర్గా ఉంటా. ఈ విషయాల గురించి ఇది వరకే చర్చించాం. ప్రస్తుతానికి నేను సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నాను. ‘‘శంకర్’’ సినిమా పూర్తవగానే ‘‘గౌతమ్ తిన్ననూరి’’ సినిమా షూటింగ్లో పాల్గొంటాను’’ అని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ ‘‘శంకర్’’ సినిమా షూటింగ్తో బిజీబిజీగా గడుపుతున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్గా శంకర్-రామ్చరణ్ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక, చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ‘‘ ఆచార్య’’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మరి, పవన్, చెర్రీల మల్టీస్టారర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మందు గ్లాసులతో సురేఖ, సుప్రిత! పిక్స్ వైరల్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.