RRR.. ఈ సినిమా కోసం ఇప్పుడు దేశం అంతాఎదురు చూస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా.. అత్యంత భారీ బడ్జెట్తో ఆర్.ఆర్.ఆర్ తెరకెక్కింది. మార్చి25న ప్రపంచ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి కనిపిస్తోంది. థియేటర్ల ముందు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాట్లు చేసే పనుల్లో ఇటు నందమూరి, అటు మెగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఓ థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ అభిమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది.
కోదాడలోని ఓ థియేటర్ వద్ద యన్టీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో ఇరు అభిమానుల మధ్య పరస్పరం గొడవ జరిగినట్లు సమాచారం. ఇక దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు ఏకంగా పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న స్థానికులు, తోటి అభిమానులు అతడిని వారించి అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టినట్టు సమాచారం. ఇక దీంతో RRR మూవీ ప్రదర్శనకు రెడీ అవుతోన్న ఆ ప్రముఖ థియేటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.