Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లికి హాజరైన సెలెబ్రిటీ అతిథులకు, బంధు గణానికి తమదైన పద్ధతిలో ఖరీదైన బహుమతులు ఇచ్చారు ఈ దంపతులు. ప్రతీ ఒక్క అతిథికి వెండి, బంగారంతో కూడిన బహుమతులు ఇచ్చారు. అతిథులకే కాదు.. పెళ్లికిముందు ఒకరికొకరు కూడా అత్యంత ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నారు.
నయనతార తన భర్త విగ్నేష్ శివన్కు దాదాపు 20 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాను కానుకగా ఇచ్చారు. అదే విధంగా.. విగ్నేష్ శివన్ పెళ్లి రోజు నయనతార ధరించిన బంగారు నగల్ని కానుకగా ఇచ్చారు. వాటి ఖరీదు దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వాటితో పాటు ఓ ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చారు. ఆ డైమండ్ రింగ్ ఖరీదు దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక నయనతార.. విగ్నేష్ శివన్కు మాత్రమే కాదు అతడి చెల్లెలికి, అతడి తరపు, ఆమె తరపు బంధువులకు పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చారంట. ఒక రకంగా ఆడపడుచుకు కట్నంగా విగ్నేష్ శివన్ చెల్లెలు ఐశ్వర్యకు 10-15 లక్షల రూపాయలు విలువచేసే 30 పీస్ బంగారు నగల్ని కానుకగా ఇచ్చారంట.
కాగా, పెళ్లి తర్వాత నయన తార, విగ్నేష్ శివన్ల జంట శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దర్శనం తర్వాత తిరుమల మాఢ వీధులో నయనతార చెప్పులతో తిరగటం పెను దుమారం రేపింది. అంతేకాదు! ఈ జంట ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా మాఢ వీధుల్లో ఫొటో షూట్ సైతం నిర్వహించటంతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నయన తార భర్త విగ్నేష్ శివన్ స్పందించారు. టీటీడీని క్షమాపణలు కోరుతూ ఓ లేఖను విడుదల చేశారు. మరి, నయనతార, విగ్నేష్ శివన్ల పెళ్లి కానుకలపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nayanthara: పెళ్ళికి నయనతార కట్టుకున్న ఈ చీర స్పెషల్ ఏమిటంటే?