Nayan And Vignesh: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయన తార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ల పెళ్లి గురువారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్ వరకు ప్రముఖులంతా ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఈ జంట తిరుమల వెళ్లింది. శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. దైవ దర్శనం అనంతరం గుడి బయట ఫొటోలు తీసుకుంది. ఈ జంట పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది. శనివారం చెన్నై, రాయ్పేటలోని తాజ్ క్లబ్ హౌస్ హోటల్లో జర్నలిస్ట్ల కోసం విందును ఏర్పాటు చేసింది.
విందు అనంతరం నిర్వహించిన మ్యారేజ్ ప్రెస్ మీట్లో నయనతార, విగ్నేష్ శివన్ మాట్లాడారు. మొదట నయనతార మాట్లాడుతూ.. ‘‘మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. ఇన్ని రోజులు మీరు మాకు మద్దతుగా నిలుస్తూ రావటం చాలా పెద్ద విషయం. ఇప్పుడు పెళ్లైంది. ఇంకా మీ మద్దతు మాకు అవసరం. థాంక్యూ సోమచ్’’ అని అన్నారు. అనంతరం విగ్నేష్ మాట్లాడుతూ.. ‘‘ నేను మొదటి సారి నయనతారను కలిసింది ఈ హోటల్లోనే.. కథ చెప్పటానికి. అందుకే! మిమ్మల్ని అందర్ని ఇక్కడ కలవటం చాలా సంతోసంగా ఉంది. పెళ్లితో ఒక్కటైన మాకు ఇకపై కూడా మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా..’’ అని అన్నాడు.
కాగా, పెళ్లి తర్వాత నయన తార, విగ్నేష్ శివన్ల జంట శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దర్శనం తర్వాత తిరుమల మాఢ వీధులో నయనతార చెప్పులతో తిరగటం పెను దుమారం రేపింది. అంతేకాదు! ఈ జంట ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా మాఢ వీధుల్లో ఫొటో షూట్ సైతం నిర్వహించటంతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నయన తార భర్త విగ్నేష్ శివన్ స్పందించారు. టీటీడీని క్షమాపణలు కోరుతూ ఓ లేఖను విడుదల చేశారు. మరి, నయన్, విగ్నేష్ల మొదటి మీటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nayanthara: విగ్నేష్ శివన్ చెల్లెలికి భారీగా ఆడపడుచు కట్నం! నయన్ ఎంత ఇచ్చింది అంటే?