నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టేజ్ పై నేచురల్ స్టార్ నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలోకి నేను వచ్చి చాలా కాలం అయ్యింది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరి స్టార్ హీరోలను కలిశాను.. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ ని మాత్రం కలవలేకపోయారు. అలాంటిది మేం ఆహ్వానించగానే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయన గురించి మాట్లాడుతుంటే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. అందరూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటారు.. ఇప్పుడు ఆయనను కలిసిన తర్వాత అర్థం అయ్యింది ఎంత గొప్ప వ్యక్తి అని.. నిజంగా హ్యాట్సాఫ్ అన్నారు.
మా వాళ్ల అందరికీ ఓ తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది.. అదేంటో రేపు మీ అందరికీ తెలుస్తుంది..’ అంటూ పవన్ డైలాగ్తో స్పీచ్తో నేచురాల్ స్టార్ నాని అదరగొట్టాడు. ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా ఫీలవుతున్నానని అన్నాడు. ఈ మూవీతో కచ్చితంగా హిట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఎంతగానో అలరిస్తుందని నేను ఎంతగానో నమ్ముతున్నారు.. హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మూవీ కాదు.. మంచి ఎంటర్ టైన్ మెంట్ అని అన్నారు.
ఇక ‘అంటే.. సుందరానికీ!’ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి పవన్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా పొగిడారు. మరి కొన్ని గంటల్లో అంటే సుందరానికీ మూవీ విడుదలవుతుండగా.. పవన్ కళ్యాణ్ కోసం 8న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 9కి షిఫ్ట్ చేశారు. ఈ వేడుకలో పవన్ కళ్యాన్ తో పాటు దర్శకులు సుకుమార్, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.