సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్, డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే.. సర్కారు వారి పాటకు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు.. అటు ఓవర్సీస్ నుండి సైతం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమా చూసిన టాలీవుడ్ దర్శకులు మహేష్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. మహేశ్ సతీమణి నమ్రతా ఇటీవలే ఫ్యాన్స్ తో కలిసి భ్రమరాంబ థియేటర్ లో సర్కారు వారి పాట సినిమా చూశారు.
తాజాగా మరోసారి నమ్రత ఫ్యాన్స్, సినిమా బృందంతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న పాపులర్ సుదర్శన్ థియేటర్లో స్పెషల్ షో చూశారు. నమ్రతకు ఘన స్వాగతం పలికింది థియేటర్ యాజమాన్యం. అనంతరం ఫ్యాన్స్ సమక్షంలో సర్కారు వారి పాట మూవీని ఎంజాయ్ చేశారు నమ్రత. ప్రస్తుతం సుదర్శన్ థియేటర్ లో నమ్రత కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.