టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో వంశీ సినిమాతో కలిసిన వీరిద్దరూ.. అదే సమయంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇక మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత నటనకు గుడ్ బై చెప్పేసింది. అప్పటినుండి భర్త, పిల్లలు అంటూ ఫ్యామిలీకే అంకితమైంది. ఓవైపు మహేష్ సినిమాలతో బిజీగా ఉంటే.. నమ్రత కుటుంబ వ్యవహారాలను, జిఎంబి ప్రొడక్షన్స్ పనులను చూసుకుంటోంది.
ఈ క్రమంలో నమ్రత సినిమాలు చేయకపోయినా.. మహేష్ బాబుతో కలిసి అప్పుడప్పుడు ఫోటోషూట్స్ పాల్గొంటూ ఉంటుంది. అయితే.. అడపాదడపా నమ్రత ఫోటోషూట్లు, సోషల్ మీడియా పోస్టులలో కనిపించేసరికి ఆమె మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందేమోనని అభిప్రాయాలు బయటికి వచ్చాయి. తాజాగా నమ్రత రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లో తన స్నేహితులు స్టార్ట్ చేసిన స్టైలింగ్ స్టోర్ ఓపెనింగ్ కి గెస్ట్ గా వెళ్ళింది.ఈ సందర్భంగా నమ్రత తన రీఎంట్రీతో పాటు ఫ్యామిలీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “మహేశ్ కు షాపింగ్ అంటే అసలు నచ్చదు. ఆయన కోసం కూడా తానే షాపింగ్ చేస్తాను. ఇక నేను తిరిగి సినిమాల్లో రావాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ వారందరిని నేను హర్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను నా ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నాను. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. నాకు మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన రాకపోవచ్చు” అంటూ నమ్రత చెప్పుకొచ్చారు. ఇక రీఎంట్రీపై నమ్రత క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. మరి నమ్రత రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Happy 17th aniversary @urstrulyMahesh & #NamrataShirodhkar❤️#HappyAnniversaryNamrataMahesh #MaheshBabu pic.twitter.com/sxf5DO0Hpy
— PavanKarthik (@__BeingPavan__) February 9, 2022