ఈ మద్య కాలంలో చాలా మంది వినోదం కోసం థియేటర్లకు వెళ్లడం మానేశారు.. ఎందుకంటే మన ఇంట్లోనే హెచ్ డీ ప్రింట్ లో సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. ఇక యూట్యూబ్, అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ లో కొత్త కొత్త చిత్రాలు చూసే అవకాశం దక్కుతుంది. దీంతో చాలా మంది వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ముందుకు వచ్చాయి. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందింది మై విలేజ్ షో. ఈ షో గ్రామీణ వాతావరణం లో మనకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్ల మాదిరిగా ఉంటాయి.. అందుకే ఈ షోని చాలా మంది ఇష్టపడుతున్నారు.
మై విలేజ్ షో అనేది శ్రీరామ్ శ్రీకాంత్ ప్రారంభించిన ప్రముఖ యూట్యూబ్ ఛానెల్. తెలంగాణలోని లంబాడిపల్లిలో ఆవిర్భవించిన తొలి తెలుగు ఛానెల్ ఇది. గ్రామీణ జీవన శైలికి వినోదాన్ని జోడించి వీడియోలు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గా నిలుస్తున్నాయి. ఈ ఛానల్ ద్వారా గంగవ్వ ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. మై విలేజ్ షో ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన యూ ట్యూబర్ బైరగోని రాజ్కుమార్ కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ మద్య ప్రముఖ న్యూస్ ఛానల్ లో కూడా రాజు తన వినోదాన్ని పంచి ప్రేక్షకులచే శభాష్ అనిపించుకున్నాడు.
ఇక ఎవరికైనా సొంతింటి కల నెరవేరడం అనేది గొప్ప అనుభూతినిస్తుంది. తాజాగా మై విలేజ్ రాజు సొంత ఇంటి కల నెరవేరింది. ఈ సందర్భంగా మై విలేజ్ షో టీమ్ తో రాజు చేసిన సందడి అంతా ఇంతా కాదు.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజు కొత్త ఇల్లు చూసిన వారంతా అతనికి శుభాకాంక్షలు అందిస్తున్నారు. మరి.. గా మై విలేజ్ షో నూతన గృహప్రవేశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.