ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమకు సంబందించిన పలు అంశాలను చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. తాడెపల్లిలో జరిగిన ఈ భేటీలో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, ఆలి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ పెద్దల చర్చలు దాదాపు సఫలం అయ్యాయి.
ధియోటర్లలో టికెట్ ధరల అంశంతో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు. కొత్త సినిమాల విడుదల సందర్భంలో ఐదు షోలకు కూడా అనుమతి లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ వ్యవహారంలో మంచు ఫ్యామిలీ ఎక్కడా కూడా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇంకేముంది సోషల్ మీడియాలో మంచు వారి కుటుంబం మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల సమయంలో మోహన్ బాబు, మంచు విష్ణు వ్యవహార శైలిపై ఇప్పుడు ట్రోలింగ్ అవుతోంది. మా ఎన్నికల సందర్బంగా మంచి ఫ్యామిలీ వ్యవహరించింవ తీరుపై ఈరోజు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మా అధ్యక్షుడు ఎక్కడున్నాడు, మంచు విష్ణుని పిలవలేదా, లేక పిలిచినా ఆయన వెళ్లలేదా, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
ఇది చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్కు కారణమేంటంటే..!
అటు మంచు మనోజ్.. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి కలిసి ఉన్న ఫోటోపై ట్వీట్ చేశాడు. కన్నుల పండువగా ఉందని వెటకారంగా కామెంట్ పెట్టాడు. ఇంకేముంది నెటిజన్లు మంచు మనోజ్ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్నారు. మీ అన్న ఇందులో మిస్ అయ్యాడు.. ఎక్కడున్నాడు.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఈ ఫోటో తీసింది మీ అన్నేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
😍❤️💫 kannula Panduga pic.twitter.com/culQuVV8FU
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 10, 2022