టాలీవుడ్ యువనటుడు అడివి శేష్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘మేజర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో చిత్రబృందం నాన్ స్టాప్ ప్రమోషన్స్ జరుపుతోంది. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు విడిచిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మేజర్ చిత్రబృందం రిలీజ్ విషయంలో వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా స్పెషల్ షోలు అనేవి.. సినిమా రిలీజ్ కి కొన్ని గంటల ముందుగా ప్లాన్ చేస్తుంటారు. కానీ, మేజర్ సినిమా విషయంలో మేకర్స్ సర్ప్రైజ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాను ఏకంగా పదిరోజుల ముందు నుండే.. ఇండియాలోని 9 ప్రధాన నగరాలలో స్పెషల్ షోలు నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా సినిమాను ముందే ప్రదర్శించడానికి మేజర్ చిత్రయూనిట్.. బుక్ మై షోతో జతకట్టింది.జూన్ 3న మేజర్ అధికారికంగా దేశవ్యాప్తంగా రిలీజ్ కావాల్సి ఉండగా.. మే 24 నుండే దేశంలోని ప్రధాన నగరాలలో రోజుకో సిటీలో మేజర్ సినిమా ప్రివ్యూ ప్రదర్శితం కాబోతుంది. బుక్ మై షో యాప్ లో ఏ రోజు ఏ సిటీలో ప్రివ్యూ వేయనున్నారో చూసి టికెట్స్ బుక్ చేసుకొని ముందే సినిమా చూసేయొచ్చు. జూన్ 3న మేజర్ తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. ఇదిల ఉండగా.. మేజర్ సినిమా ప్రివ్యూ షోలు.. పూణే, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో నగరాల్లో ప్రదర్శించనున్నారు. మరి మేజర్ టీమ్ వినూత్న ప్రయత్నం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
HERE it is!!! MASSIVE! For the FIRST TIME EVER!#MAJOR
X@bookmyshow pic.twitter.com/so2fTAx4Y6— Adivi Sesh (@AdiviSesh) May 23, 2022