టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ సినిమా జూన్ 3న దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు విడిచిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అయితే.. మేజర్ సినిమాను రిలీజ్ కు ముందు 9 రోజులపాటు ఇండియాలోని ఒక్కో సిటీలో ఒక్కో ప్రివ్యూ షో వేయనున్న విషయం విదితమే.
తాజాగా పూణేలో మేజర్ సినిమా మొదటి ప్రివ్యూ షో రిలీజ్ అయ్యింది. ప్రివ్యూ చూసిన ప్రేక్షకులంతా థియేటర్లో ఎమోషనల్ అయిపోయారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీని, నాటి ముంబై దాడులకు సంబంధించి ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం పూణే థియేటర్లో ప్రివ్యూ షోకి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ప్రేక్షకులంతా థియేటర్లో ‘భారత్ మాతా కి జై’ అంటూ నినాదాలు చేశారు. అలాగే మేజర్ చిత్రబృందం కూడా థియేటర్లోకి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసింది. వీల్ చైర్ లో కూర్చున్న ఓ వ్యక్తిని అడివి శేష్ హత్తుకొని ఎమోషనల్ అయ్యాడు. అనంతరం సినిమా చూసిన ప్రేక్షకులకు థాంక్స్ తెలిపాడు. మరి వైరల్ అవుతున్న మేజర్ ప్రివ్యూ రెస్పాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Overwhelming response for the #MajorTheFilm 🇮🇳 Pune Screening 🔥🔥
Chants of Bharat Mata Ki Jai and Vande Mataram after the screening and huge applause for the team from the audience ❤️🔥#MajorPreReleasePreviews #Major 🇮🇳#MajorOnJune3rd pic.twitter.com/FtxJOb2dye
— GMB Entertainment (@GMBents) May 25, 2022