ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఫలానా దర్శకుడితో తమ హీరో సినిమా చేస్తే బాగుండు అని అభిమానులు గట్టిగా కోరుకుంటారు.. కానీ ఏళ్లు గడిచినా వారి కోరిక తీరదు. మరీ ముఖ్యంగా కొన్ని కాంబినేషన్లు ఎందుకు కుదరవో అసలే అర్థం కాదు. తాజాగా సూపర్ స్టార్ మహేష్బాబు అభిమానులకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆల్ ఇండియా రేంజ్లో పాపులరైన దర్శకుడితో మహేష్ సినిమా కాదన్నాడన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో ఈ గ్యాప్లో పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్నాడు మహేష్బాబు. అరడజనకుపైగా స్టోరీలు విన్నా.. ఆయనకు ఏదీ నచ్చలేదట. చివరికి త్రివిక్రమ్ స్టోరీ ఒక్కటి మాత్రం ఓకే చేశాడు. అయితే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథల్లో కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ కూడా ఉందని తెలుస్తోంది. అందరిలాగే ప్రశాంత్ నీల్ కూడా స్క్రిప్ట్ తీసుకొని వెళ్లగా.. అది విన్నాక సింపుల్గా నో చెప్పేశాడట. అయితే అదే కథను ఆశ్చర్యకరంగా యంగ్ టైగర్ ఎన్టీయార్ ఒకే చేయడం బిగ్ డిబేట్గా మారింది. ఎన్టీయార్కు నచ్చిన కథ.. మహేష్బాబుకు ఎందుకు నచ్చలేదన్నదే ఇప్పుడు అందిరిని షాకింగ్కు గురి చేస్తోంది.
మహేష్ బాబుకు ప్రశాంత్ స్టోరీ కనెక్ట్ కాకపోవడానికి స్ట్రాంగ్ కారణాలే వినిపిస్తున్నాయి. కామన్గా ప్రశాంత్ నీల్ సినిమా అంటే పూర్తిగా హై లెవెల్ యాక్షన్ బేస్ చేసుకొని.. మాస్ అంశాలతో ఉంటుంది. అయితే ఆ మాస్ స్క్రిప్ట్ నేరేషన్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ మహేష్కు అసాధ్యం అనిపించి ఉండొచ్చన్నది కొందరి మాట. అందులోను మహేష్ రఫ్ లుక్కులో ఇప్పటివరకు మాస్ యాక్షన్ సినిమా చేయలేదు. సో స్క్రిప్ట్ లో ఎలివేషన్ సీన్స్ నమ్మకం కలిగించే అవకాశం తక్కువ. అందుకే మహేష్ ఒకే చేసి ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. మరి.. మహేష్ కాదన్న స్టోరీతోనే యంగ్ టైగర్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి మరి