టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో, అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చింది. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి.. హైయెస్ట్ రీజియన్ ఫిలిం రికార్డును బ్రేక్ చేసింది. అలాగే మొదటి వారంలోనే ఈ సినిమా 172 కోట్లకు పైగా వసూల్ చేసింది.
ఇదిలా ఉండగా.. తాజాగా సర్కారు వారి పాట సక్సెస్ మీట్ లో చిత్రబృందం పాల్గొని సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారు. అయితే.. ఈ సినిమాలో మహేష్ – కీర్తి లోనే విషయంలో గొడవపడే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో కీర్తి మహేష్ బాబును తిడుతుంది. కీర్తి మహేష్ ని తిట్టడాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసినప్పటికీ, కొందరు ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం మహేష్ బాబు అలా తిట్టించడంపై విమర్శించారు.
తాజాగా మహేష్ – కీర్తి ఆ కామెడీ సన్నివేశం గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో మహేష్ మాట్లాడుతూ.. ‘దుబాయ్ లో షూట్ చేస్తున్నాం. ఎండలు మండిపోతున్నాయి. ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. ఎన్ని టేక్స్ తీసుకున్నా.. అమ్మాయి తిట్టడం లేదు. మిమ్మల్ని చూసి తిట్టలేను సర్.. అంది. నేనే తిట్టు తిట్టు అని అన్నా చేయలేదు. ఆఖరికి డైరెక్టర్ గారు చెప్పి ఆమెను కన్విన్స్ చేశడు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే కీర్తి కూడా నవ్వుతూ ఆ సీన్ గురించి మాట్లాడింది. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.