టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో మహేష్ మరోసారి పోకిరిని గుర్తు చేసాడని ఫ్యాన్స్, సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయని మహేష్ కూడా చెప్పాడు. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటించింది.
ఇక తాజాగా సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ పోకిరి సినిమా సీక్వెల్ గురించి స్పందించాడు. ఈ మధ్యకాలంలో ఏ సినిమా హిట్టు అయినా సీక్వెల్ తీసేస్తున్నారు. మరి మీ కెరీర్ లో పోకిరి సినిమా పెద్ద హిట్ అయ్యింది కదా.. ఆ సినిమాకు పార్ట్-2 ఎందుకు ప్లాన్ చేయలేదు? అనే ప్రశ్నకు మహేష్ స్పందిస్తూ.. “పోకిరి టైమ్ లో ఈ సీక్వెల్స్ కల్చర్ లేదు. అందుకే కావచ్చు పార్ట్-2 ప్లాన్ చేయలేదు. ఏదైనా ఉంటే పూరి జగన్నాథ్ నెంబర్ ఇస్తా.. ఆయన్నే అడగండి” అంటూ నవ్వేశాడు. మరి మహేష్ పోకిరి సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.