Rajamouli: యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళిల స్నేహం ఈనాటిది కాదు. 2001లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో వీరి స్నేహ ప్రయాణం మొదలైంది. ఈ సినిమా రాజమౌళి మొదటి సినిమా. ఆ తర్వాత తన రెండో సినిమా కూడా జూ.ఎన్టీఆర్తోనే తీశారు రాజమౌళి. ఆ సినిమానే ‘‘సింహాద్రి’’. ఈ సినిమాతో ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించారు. నటుడిగా ఎన్టీఆర్ను, దర్శకుడిగా రాజమౌళిని ఓ స్థాయిలో నిలిపిన సినిమా ఇది. 2003లో ‘‘సింహాద్రి’’ రాగా, సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి ఇద్దరూ కలిశారు. 2007లో ‘యమదొంగ’ సినిమా తీశారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. వీరిద్దరి కాంబినేషన్లో నాల్గవ సినిమాగా ‘‘ఆర్ఆర్ఆర్’’సినిమా వచ్చింది.
ఈ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ కలిసి నటించారు. రాజమౌళి ఓ హీరోతో మూడు కంటే ఎక్కువ సినిమాలు తీశారంటే అది జూ.ఎన్టీఆర్తోనే. ఇందుకు ప్రధాన కారణం ఈ ఇద్దరి మధ్యా ఉన్న సాన్నిహిత్యం. ఈ విషయాన్ని ఇద్దరూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. నటుడిగా జూ.ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని రాజమౌళి పదేపదే చెబుతుంటారు. ఎన్టీఆర్ కూడా రాజమౌళితో స్నేహం ప్రత్యేకమైనదని అంటుంటారు. అలాంటిది, జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి శుభాకంక్షలు చెప్పకపోవటంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో మండిపాటు తెలియజేస్తున్నారు. మా హీరోను విష్ చేయటానికి కూడా తీరికలేదా అంటూ మండిపడుతున్నారు. రాజమౌళి నేరుగానైనా ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపారో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రాజమౌళి ఎందుకు శుభాకాంక్షలు తెలియజేయలేదన్న దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియా పుకార్ల నేపథ్యంలో నైనా రాజమౌళి స్పందిస్తారేమో వేచి చూడాల్సిందే.. మరి, రాజమౌళిపై జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sudhakar Komakula: తండ్రైన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో సుధాకర్!