స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇటీవల ‘దేవరశాంటా’ పేరుతో 10 వేల రూపాయల చొప్పున 100 మందికి క్రిస్మస్ బహుమతులు ఇస్తానని విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దేవరశాంటా ప్రకటనకు ఫ్యాన్స్ నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ట్విట్టర్ వేదికగా దేవరశాంటా-2021 హ్యాష్ ట్యాగ్ కు అధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక వచ్చిన రిక్వెస్టులలో 100 మందిని సెలెక్ట్ చేసింది విజయ్ దేవరకొండ బృందం. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున త్వరలో ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా విజయ్ స్పందించి.. ‘మై లవ్స్ దేవరశాంటా విజేతల లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి మనీ పంపిస్తుంది’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
My loves, check for your names🤍@TeamDeverakonda will Reach out
And the money transfers will follow 🙂Love,
Vijay #DeveraSanta21 pic.twitter.com/PQ7Jc7cUa8— Vijay Deverakonda (@TheDeverakonda) January 7, 2022
విజయ్ దేవరకొండ బిగ్ స్టార్ అయ్యాక దేవరశాంటా పేరుతో క్రిస్మస్ సందర్భంగా బహుమతులు అందిస్తున్నాడు. ఈ ఏడాది కూడా దేవరశాంటా-2021 విజేతలకు నగదు రూపంలో బహుమతులు ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా 2022 ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి విజయ్ అందిస్తున్న ఈ దేవరశాంటా గిఫ్ట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.