హెబ్బా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్. తెలుగులో పదికిపైగా సినిమాలు చేసినా కూడా.. రెగ్యులర్ హీరోయిన్ కాలేకపోయింది. నిజానికి హెబ్బా పటేల్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. తెలుగులో ‘అలా ఎలా’ సినిమా నుంచి మొన్నటి రెడ్ లో స్పెషల్ సాంగ్ వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని హెబ్బా సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. అందం, అభినయం, నటన ఉన్నా టాలీవుడ్ లో సరైనా బ్రేక్ రాలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హెబ్బా పటేల్ తాజాగా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది.
శ్రీదేవీ డ్రామా కంపెనీ కామెడీ షోకి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన హెబ్బా పటేల్ రచ్చ రచ్చ చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం రావడం వల్ల ఎగ్జైట్ అయ్యిందనుకోవాలేమో. సాధారణంగా షోలో భాగంగా సుడిగాలి సుధీర్ తో స్కిట్ చెయ్యమన్నారు. అందుకు సుధీర్ నచ్చలేదేమో అనగానే.. బాగా నచ్చాడంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఆటో రాంప్రసాద్, ఆదీతో కామెడీ ట్రాక్ చేస్తూ.. ఆదీకి వరుసగా హగ్గుల హగ్గుల మీద హగ్గులు ఇచ్చేసింది.గ్యాప్ లో నరేశ్ కూడా అడిగి మరీ హగ్గు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆనందంతో గంతులు కూడా వేశాడు. అంతా బాగానే ఉంది గానీ, ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలతో చూసే షోలలో ఏది ఈ రచ్చ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెబ్బా పటేల్ రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: న్యూస్ రీడర్వి.. ఆ మాత్రం తెలియదా.. శివజ్యోతిని ఆడుకుంటున్న నెటిజనులు!
ఇదీ చదవండి: బిందు మాధవి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి.. వీడియో వైరల్!