ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసే డాన్సులు ఒక ఎత్తు అయితే.. జడ్జెస్ ప్రియమణ-నందితా శ్వేత-జానీ మాస్టర్, హైపర్ ఆదీ, యాంకర్ ప్రదీప్ వీళ్ల మధ్య నడిచే ట్రాకులు బాగా నవ్విస్తుంటాయి. అంతేకాకుండా ఒక్కోసారి డాన్సుల కంటే వీళ్ల స్కిట్లు, పర్ఫార్మెన్స్ లకే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. అలాగే తాజాగా విడుదల చేసిన ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ ప్రోమోలో కూడా అదే జరిగింది. హైపర్ ఆదీ కామెడీ, జానీ మాస్టర్ రియాక్షన్స్ ఈ ప్రోమోలో హైలెట్ గా నిలిచాయి.
మరోవైపు జడ్జెస్ ప్రియమణి, నందితా చేసిన పనికి ప్రేక్షకులు ఒకింత కుళ్లుకుంటూ, మరోపక్క నోరెళ్లబెడుతున్నారు. డాన్సర్ ప్రసాద్ కాలికి కట్టుతోనే వచ్చి రారా బంగారం సాంగ్ కు డాన్స్ చేశాడు. ప్రసాద్ డాన్సును మెచ్చిన ప్రియమణి స్టేజ్ మీదకు వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టింది. అది చూస్తున్న మరో జడ్జి నందితా కూడా స్టేజ్ పైకి వెళ్లి ప్రసాద్ కు ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ ముద్దుల ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ప్రసాద్ తిరిగి స్టేజ్ మీదకు రావడంపై జడ్జులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఢీ 13షోలో ప్రసాద్ కెంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రోగ్రామ్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కాలికి దెబ్బ తగలడంతో షో నుంచి తప్పుకున్నాడు. మళ్లీ ఇంత గ్యాప్ తర్వాత ప్రసాద్ స్టేజ్ మీదకు వచ్చి పర్ఫార్మ్ చేయగానే ప్రేక్షకులు ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఢీ లేటెస్ట్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.