Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఓ ప్రకటనతో ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ ఆయనపై ఓ సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి తాజాగా, ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకులపై ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని, తప్పుదోవ పట్టించేదిలా ఉందని సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు ప్రకటనలో నటించినందుకు అల్లు అర్జున్పై కేసు పెట్టారు. అల్లు అర్జున్తో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కూడా కేసు పెట్టారు.
తప్పుడు సమాచారాన్ని అందించే ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జొమాటో, ర్యాపిడో ప్రకటనల్లో నటించిన అల్లు అర్జున్ పలు వివాదాల్ని ఎదుర్కొన్న సంగతి విధితమే. ర్యాపిడో యాడ్ ప్రభుత్వ రవాణా సంస్థను కించపరిచే విధంగా ఉందంటూ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. సదరు యాప్, అందులో నటించిన అల్లు అర్జున్కు లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు.
కాగా, పుష్ప సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ వేవ్ను సృష్టించారు. విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ‘పుష్ప’ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా పుష్ప షర్టులు కూడా వచ్చేశాయి. రంగుల రంగుల డిజైన్లతో ఉన్న ఆ షర్టుల మీద పుష్ప స్టార్స్ అల్లు అర్జున్, రష్మిక మందన్నల బొమ్మలు ముద్రించి ఉన్నాయి. కేవలం షర్టులు మాత్రమే కాదు.. పుష్ప లోగోతో పాటు అల్లు అర్జున్ బొమ్మలు ఉన్న టీషర్టులు కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరి, అల్లు అర్జున్పై నమోదైన కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: ఇండస్ట్రీ ఎవరి సొత్తు కాదు.. సినిమా వేరు రాజకీయం వేరు: పవన్…