కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఇంకా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించి బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల తరహాలోనే రూ.1000 కోట్ల మార్క్ను దాటిన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ బ్లాక్ బాస్టర్ చిత్రం ముఖ్యంగా హిందీ వెర్షన్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ పోతోంది. కేజీయఫ్ 2 మూవీకి సీక్వెల్ ఉండబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
కేజీఎఫ్ 3 మరో భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కేజీఎఫ్ 2 చిత్రం క్లయిమాక్స్ లో సీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ఈ సీక్వెల్ లో రాకీ మళ్లీ బతుకుతాడా? అమ్మకిచ్చిన మాట రాఖీ నిలబెట్టుకుంటాడా? ఇవే ప్రశ్నలు కేజీఎఫ్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సీరీస్ లో విలన్ల హవా ఏ రేంజ్ లో చూపించారో అందరికీ తెలిసిందే. తొలి రెండు పార్టుల్లో విలన్లు మొత్తం చనిపోయారు. కేజీయఫ్ 3 లో హీరో ఎలా బతికాడో తెలిసిపోతుంది.. అదే విధంగా కొత్త విలన్ ఎవరు అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇక కేజీఎఫ్ 3 లో రానా ఉండబోతున్నాడా అని అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రానాకి ట్విటర్లో ఇచ్చిన రిప్లైనే. ఆ మద్య ‘కేజీయఫ్ 2’ను పొగుడుతూ రానా ట్వీట్ చేస్తే దానికి ప్రశాంత్ రిప్లై ఇచ్చారు. అందులో త్వరలో కలుద్దాం అంటూ రాశారు. కేజీఎఫ్ 3 మూవీ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ మనసులో ఏముంది అనేది ఆయనే తెలియాలి. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నెటిజన్లు రక రకాల ఊహాగానాలకు తెర లేపుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.