తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నా టాప్ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఈ కార్యక్రమం వచ్చి.. చాలా ఏళ్లు గడుస్తోన్న ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ ఎంతగా ఫేమస్ అయ్యారో ఈ ముగ్గురే ఎక్స్ ట్రా జబర్దస్త్ కి పెద్ద బలం అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల జబర్దస్త్ షో నుంచి గెటప్ శ్రీను, సుధీర్ బయటకి వెళ్లారు. వీరిద్దరు షో నుంచి బయటకి వెళ్లడం పై అనేక వార్తలు వినిపించాయి. అయితే తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వాళ్లు వెళ్లడానికి అసలు కారణం బయటపడింది. “నీ వల్లే సుధీర్, శ్రీను బయటకి వెళ్లారంటా, నిజమా?” అంటూ నటి ఇంద్రజ అడిగిన ప్రశ్నకు రామ్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రోమో వీడియోలో.. ఇంద్రజ టీమ్ లీడర్స్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అందులో భాగంగా రామ్ ప్రసాద్ ను కూడా ఓ ప్రశ్న అడుగుతుంది. “స్క్రిప్ట్ లు సరిగ్గా రాయకపోవడంతోనే మీ టీమ్ మెంబర్స్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అది నిజమా?” అంటు ఇంద్రజ.. రామ్ ప్రసాద్ ని ప్రశ్నిస్తారు. “సీరియస్ గా ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ల నా ఆన్సర్”.. అంటూ రామ్ ప్రసాద్ మాటలు అక్కడితో ఆపేస్తారు. తరువాత “నాది ఓ ప్రశ్నం మేడమ్ అంటూ.. రోజా గారు మంత్రి కాకుడదని దేవుడిని మీరు మొక్కుకున్నారంటా? ఎందుకు మేడమ్” అంటూ ఇంద్రజాను రామ్ ప్రసాద్ అడుగుతాడు. అక్కడి తో ప్రోమో ఎండ్ అవుతుంది. అయితే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఏమిటి అనేది రాబోయే ఫుల్ ఏపిసోడ్ చూస్తేనే అసలు విషయం తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆరోజు అమీర్ ఖాన్ చేసిన తప్పు.. వీడియో షేర్ చేసి పరువు తీసిన కంగనా!