తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీ, రాజకీయాలపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. బండ్ల గణేష్ కు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఒంగోలు ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ రూ.1 కోటి 25 లక్షల రూపాయల చెక్ను ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై సదరు జెట్టి వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ స్పందిచలేదు. దీంతో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు జడ్జి బండ్ల గణేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. గతంలో కూడా ఇలాంటి కేసులోనే పోలీసులు బండ్ల గణేష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఇదీ చదవండి : నైట్ కర్ఫ్యూపై పొలిటికల్ లీడర్స్ కు రామ్ గోపాల్ వర్మ చురకలు!
కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర కొంత అమౌంట్ తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో.. బండ్ల గణేష్పై కడపలో మహేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కోర్టు విచారణకు బండ్ల హాజరు కాకపోవడంతో అప్పట్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కడప మెజిస్ట్రేట్. అనంతరం బండ్లను అరెస్ట్ చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.