ప్రస్తుతం దక్షిణాదిలో ఏ జంట పెళ్లి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే.. లేడీ సూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్ల గురించే. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారు. తమ బంధం గురించి వీరిద్దరు ఓపెన్గా ఉన్నారు. కలిసి షికార్లు చేయడం, వెకేషన్స్కి వెళ్లడం చేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అయితే ఈ ఏడాది వీరిద్దరు తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. జూన్ 9న తిరుమల శ్రీవారి సన్నిధిలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కులం దైవం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
కాబోయే భర్త విఘ్నేష్ శివన్తో కలిసి నయనతార తంజావూరులోని పాపనాశంలో మేల్ మరతురు గ్రామంలో అమ్మవారు ఆలయాన్ని సందర్శించారు. ఈ అమ్మవారు నయనతార కుల దైవం. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేష్ శివన్, నయనతార పొంగలి పెట్టి పూజలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శింబు, ప్రభుదేవాలతో లవ్ బ్రేకప్ తర్వాత నయనతార నానుమ్ రౌడీ తాన్ సినిమా దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్కు దగ్గరైంది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కలిసి ఉంటున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉండే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటాయి.
ఇది కూడా చదవండి: Vignesh Shivan: గోరు ముద్దలు తినిపిస్తూ.. నయన్పై ప్రేమను చాటుకున్న విఘ్నేష్!ఇక వీరిద్దరూ కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ను కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన కణ్మని రాంబో ఖతీజా చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తే.. నయన తార, సమంత హీరోయిన్స్గా నటించారు. ఇది యావరేజ్ టాక్ తెచ్చకుంది. ఇక ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న గాడ్ ఫాదర్ చిత్రంలో ఆయన చెల్లెలు పాత్రలో నటించింది. ఈ ఏడాది గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కానుంది. మరి నిజంగానే జూన్లో నయనతార పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: చెట్టును పెళ్లాడబోతున్న నయనతార.. కారణం ఏమిటంటే?