‘ప్రేమమ్’ మూవీతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ కేరళ కుట్టి రౌడీ బాయ్స్ మూవీతో కొంత నెగెటివిటీని మూటగట్టుకుంది. అయినా ఫ్యాన్స్లో ఉన్న తనపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే అనుపమ అంటే యువతకే కాదు.. ఓ డైరెక్టర్కు కూడా బలే ఇష్టం. ఆమె అడిగితే.. ఏకంగా థియేటర్ మొత్తం అనుపమ కోసం బ్లాక్ చేస్తాను అంటున్నాడు. ఇంతకు ఎవరా డైరెక్టర్ అంటే..
నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సినిమా ‘అంటే సుందరానికీ’ జూన్ 10న విడుదల అవుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇన్స్టాగ్రామ్లో నెటిజనులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ చిట్చాట్లో పాల్గన్నారు. వివేక్ ఆత్రేయను అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ‘హాయ్ సార్… నేను మీ అభిమానిని. నా ఫస్ట్ షో ఫస్ట్ డే టికెట్స్ నా దగ్గరకు ఎప్పుడు వస్తున్నాయి?’ అని అడగ్గా.. ”మేడమ్! ఫుల్ థియేటర్ మీ కోసం బ్లాక్ చేశాం” అని వివేక్ ఆత్రేయ బదులిచ్చాడు. అంటే అనుపమ ఈ సినిమా చూడ్డం కోసం దర్శకుడు థియేటర్ అంతా బ్లాక్ చేశాడట. మరి నిజంగానే అనుపమ ఈ సినిమా చూస్తుందో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Video: తన ప్రేమ విషయాన్ని వెల్లడించిన హీరోయిన్ అనుపమ!
ఇక మరోక నెటిజన్ ‘ట్రైలర్ చూశాక బ్రాహ్మణుల మీద కామెడీ చేస్తున్నట్లు అనిపించింది. నిజమా? అబద్దమా?’ అని ప్రశ్నించారు. అందుకు ”అబద్దం. ‘అంటే సుందరానికీ’ ఎవరి మనోభావాలు (మతపరమైన భావాలు) కించపరిచేలా ఉండదు” అని వివేక్ ఆత్రేయ బదులు ఇచ్చారు. ప్రస్తుతం అనుపమ, వివేక్ మధ్య జరిగిన చాటింగ్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్.. కారు టైర్లలో గాలి తీసి ఆపై!