బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవలే.. ఫోర్ట్ గ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ నాటి నుంచి ఒక దాని వెనుక మరోటి శిల్పా శేట్టి దంపతులపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ముంబయి కోర్టు శిల్పా శెట్టి కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. రుణం ఎగ్గొట్టిన కేసులో శిల్పశెట్టితో పాటు ఆమె తల్లి, సోదరికి కూడా సమన్లు జారీ చేసింది. ఈ విషయమై శిల్పా శెట్టిని ఈ నెల 28న హాజరు కావాలని ముంబయి కోర్టు పేర్కొంది. శిల్పాశెట్టి కుటుంబం ఇప్పటికే అనేక కష్టాలను ఎదుర్కొంటుంది. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: మనసు చాలా బాధగా ఉంది.. థమన్ ఎమోషనల్ కామెంట్స్..!
నటి శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఓ ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని నుంచి 2015లో రూ.21 లక్షల రుణం తీసుకున్నారని సమాచారం. అయితే ఈ రుణాన్ని 2017 జనవరి నాటికి తిరిగి చెల్లిస్తానని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. శిల్పా శెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 2016, అక్టోబర్ 11న మృతి చెందారు. రుణం గురించి శిల్పా శెట్టి కుటుంబానికి తెలుసు.. అయినా డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారని ముంబయికి చెందిన వ్యాపార వేత్త పర్హద్ అమ్రా.. శుక్రవారం జుహూ పోలీస్ స్టేషన్లో శిల్పా కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పా సహా ఆమె తల్లి, సోదరిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 28 శిల్పాశెట్టితో సహా తల్లి, సోదరిని కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.
Mumbai | Andheri court issued summon to actress Shilpa Shetty Kundra, her sister Shamita Shetty and mother Sunanda Shetty following a complaint by a businessman who has alleged non-repayment of Rs 21 lakhs loan by them; court orders the three to appear on February 28
— ANI (@ANI) February 12, 2022