యాంకర్ రష్మీ– హైపర్ ఆది వీళ్లద్దరికీ బుల్లితెర, వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. వీళ్లద్దరికీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సుడిగాలి సుధీర్ శ్రీదేవీ డ్రామా కంపెనీని వదిలేశాక.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీఆర్పీ తగ్గకుండా ఉండేందుకు యాంకర్ రష్మీని శ్రీదేవీ డ్రామా కంపెనీకి తీసుకొచ్చారు. వచ్చిన మొదటి ఎపిసోడ్ లోనే రష్మీ వెళ్లి హైపర్ ఆదీ చెంప పగలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ- హైపర్ ఆది చెంప పగలగొట్టడం ఏంటని అంతా అనుకున్నారు.
అయితే కాస్తా.. టీఆర్పీ స్టంట్ అని తెలియడంతో కాస్త అసహానానికి కూడా గురయ్యారు. శ్రీ దేవీ డ్రామా కంపెనీలో టీఆర్పీ స్టంట్ అని చిన్న వీడియో విడుదల చేశారు. అందులో చాలానే స్టంట్స్ చేశారు. వాటిలో భాగంగా రీతూ చౌదరి వెళ్లి ఎంతో సీరియస్ గా హైపర్ ఆదికి ఐ లవ్ యూ చెప్తుంది. ఆ తర్వాత ఆది ఆమె ప్రపోజల్ కు నో చెప్తాడు. రీతూ చౌదరి స్టేజ్ దిగేసి వెళ్లిపోతుంది.
అదంతా పక్క నుంచి చూస్తున్న రష్మీ గౌతమ్.. పరుగున వచ్చి చెంపదెబ్బ కొట్టేస్తుంది. ఒక అమ్మాయి మనసు విరగ్గొడతావా అంటూ సీరియస్ అవుతుంది. వెంటనే ఇది కూడా స్టంట్ అంటూ వెళ్లిపోతుంది. వీరి స్టంట్స్ చూసి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లోనే కామెంట్స్ వస్తున్నాయి. రష్మీ గౌతమ్- హైపర్ ఆది మధ్య జరిగిన టీఆర్పీ స్టంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.