తెలుగు బుల్లితెరపై పాపులర్ జోడి అనగానే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ ఠక్కున గుర్తొస్తారు. వారిద్దరూ ఎప్పుడు స్క్రీన్ పై కనిపించినా ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు టీవీ ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ సెలబ్రిటీ జంట అయిన సుధీర్ – రష్మీలు స్టేజిపై చేసే పెర్ఫార్మన్స్, కామెడీ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అప్పుడప్పుడు సుధీర్ రష్మీకోసం పాటలు పాడిన సందర్భాలు కూడా చూశాం.
తాజాగా యాంకర్ రష్మీ సుధీర్ కోసం మాంచి పాట పాడి ఇంప్రెస్ చేసింది. ఎక్సట్రా జబర్దస్త్ షోకు సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కెవ్వు కార్తీక్ టీమ్ తరపున పెర్ఫర్మ్ చేయడానికి సుధీర్ కూడా వచ్చాడు. అయితే.. 24 గంటలపాటు ఏ అమ్మాయిని చూడకుండా ఉండాలని కార్తీక్ ప్రామిస్ వేయించుకుంటాడు. ఇక సుధీర్ అమ్మాయిల కంటపడకుండా ఉండేందుకు ట్రై చేస్తాడు.
ఈ క్రమంలో సుధీర్ టాస్క్ గురించి విన్న రష్మీ.. స్టేజిపైకి వచ్చి సుధీర్ కోసం పాటపాడి బుట్టలో పడేసేందుకు ట్రై చేసింది. అయితే.. రష్మీ పాట వింటూ సుధీర్ ఉండబట్టలేక చూసేస్తా అంటాడు. వెంటనే జడ్జిలు రోజా, ఆమని నవ్వుతారు. ప్రస్తుతం ఈ కొత్త ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి సుధీర్ కోసం రష్మీ పాడిన పాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.