బుల్లితెర ప్రేక్షకుల్లో రష్మీ గౌతమ్ కు ఒక పెద్ద అభిమాన సైన్యమే ఉందని చెప్పాలి. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. కొన్నాళ్లు సినిమాల్లో బిజీగా గడిపిన ఈ అమ్మడు జబర్దస్త్ లాంటి కామెడీ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీగా గడిపేసింది. ఆ తర్వాత సుధీర్ తో లవ్ ట్రాక్ యాంగిల్ బాగా వర్కౌట్ కావడంతో అనసూయ తర్వాత బుల్లితెర టాప్ యాంకర్ గా అవతరించింది. అంతేకాకుండా గుంటూరు టాకీస్ లాంటి సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ భామ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటూ ఉంటుంది.
ఇదీ చదవండి: మతిపోగొడుతున్న యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫొటో షూట్!
ఇన్ స్టాగ్రామ్ వేదికగా రష్మీ గౌతమ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, హాట్ అందాలతో అభిమానులకు కన్నుల విందు చేస్తుంటుంది. తాజాగా రంగు రంగుల చీరతో సాంప్రదాయబద్దంగా కనిపిస్తూనే మరోవైపు.. కుర్రకారును అలరించింది. గంగూబాయి కతియావాడి సినిమాలోని మేరీ జాన్ పాటకు తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంక సినిమాల విషయానికి వస్తే రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటిస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ సినిమాలోనూ రష్మీ గౌతమ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మీ చేసిన మేరీ జాన్ రీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.