తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. బుల్లితెరపై తిరుగులేని స్టార్డమ్ ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. ఈ షోకి మొన్నటివరకూ హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం సుధీర్ సినిమాలతో బిజీ అయిన కారణంగా హోస్ట్ గా యాంకర్ రష్మీ చేరింది. అయితే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న కొత్తవాళ్లను పరిచయం చేస్తూ.. ఇన్స్పైరింగ్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రోమో అంతా కూడా చాలా సరదాగా సాగినప్పటికీ, యాంకర్ రష్మీ డాన్స్, పెర్ఫార్మన్స్, హైపర్ ఆది పంచులు హైలైట్ ఇలా అన్నీ అయ్యాయి. ఈ క్రమంలో ప్రోమో ప్రారంభం నుండే హైపర్ ఆది.. యాంకర్ రష్మీపై పంచులు వేస్తూ ఆట పట్టించడం జరిగింది. కానీ చివరికి జడ్జిగా వ్యవహరించిన పూర్ణ, కమెడియన్ ఇమ్మానుయేల్ ల మధ్య జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ చూశాక.. రష్మీ స్పృహతప్పి స్టేజిపైనే పడిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రష్మీ స్పృహ కోల్పోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.