ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కనీ వినీ ఎరుగుని రీతిలో పుష్ప మానియా ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ సృష్టిస్తుంది. ఈ మూవీలో డైలాగ్స్, పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో గత కొన్నిరోజులుగా విశ్వసమతావాది శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి.
ఇది చదవండి: షూటింగ్ లో హీరో విశాల్ కి తీవ్ర గాయాలు!
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు వీవీఐపీలతోపాటు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. తాజాగా, సమతామూర్తి విగ్రహాన్ని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి విచ్చేసిన అల్లు అర్జున్ ను చిన్నజీయర్ స్వామి ఆశ్రమ వర్గాలు సాదరంగా స్వాగతించాయి. బన్నీకి ఆశ్రమ విశేషాలు, సహస్రాబ్ది ఉత్సవాల విశిష్టత, సమతామూర్తి విగ్రహ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు. ఆ తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
సమతామూర్తిని దర్శించుకోవడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని స్టైలిష్ స్టార్ పేర్కొన్నారు. సమతామూర్తిని ఎంతచూసినా తనివి తీరలేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆలయంలో ఉన్నంతసేపు తనువు భక్తితో పులకించిందన్నారు. కాగా, ఇప్పటివరకు సమతామూర్తిని అనేకమంది ప్రముఖులు సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ తదితరులు ఇక్కడికి విచ్చేశారు.