సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు సెలబ్రిటీలు కలిసి కనిపిస్తే రూమర్లు రావడం అనేది కామన్. ఆ రూమర్లు ఒక్కోసారి వారి పర్సనల్ లైఫ్ ని దెబ్బతీస్తుంటాయి. అలాంటి రూమర్లు, విమర్శలు ఎదుర్కొన్న సెలబ్రిటీలలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – హీరోయిన్ ఛార్మి కౌర్ ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటి ఛార్మి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు 20 యేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. 2002లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషలలో కూడా తెరంగేట్రం చేసింది.
ఇండస్ట్రీలో మంచి ఫేమ్ అయితే సంపాదించుకుంది కానీ అగ్రకథానాయికల లిస్టులో చేరలేకపోయింది. ఇండస్ట్రీలో ప్రతి హీరోతో సినిమాలు చేసింది కానీ ఎక్కువగా ప్లాప్స్ పడటంతో ఫామ్ కంటిన్యూ చేయలేకపోయింది. 2015లో సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించి జ్యోతిలక్ష్మి అనే సినిమాతో హిట్ అందుకుంది. అప్పటినుండి నటన ఆపేసి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. అయితే ఛార్మి కేవలం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలకు మాత్రమే సహనిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. జ్యోతిలక్ష్మి నుండి ఇప్పటివరకు పూరీ తీసిన ప్రతి సినిమాకు ఛార్మి నిర్మాణంలో భాగమైంది.
కొన్నేళ్లుగా డైరెక్టర్ పూరి – ఛార్మికి మధ్య అఫైర్స్ ఉన్నాయంటూ పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ వీరిద్దరూ పుకార్లను కొట్టిపారేశారు. తాజాగా పూరి – ఛార్మి రిలేషన్ పై పూరి కొడుకు ఆకాష్ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఛార్మి గారు చాలా మంచివారు. అలాగే చాలా టాలెంటెడ్. మా నాన్నకి ఛార్మి గారికి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది. నాన్నకు ఛార్మీ చాలా సపోర్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడక్షన్ ఫీల్డ్ లో చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. మా నాన్న డైరెక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పుడల్లా.. ప్రొడక్షన్ పనులు చూసుకోవడంలో ఛార్మి గారు బాగా సపోర్ట్ చేస్తారు. అంత మంచి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టే మా నాన్న ఆమెను దూరం పెట్టట్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడని సమాచారం. ప్రస్తుతం ఛార్మి పూరితో కలిసి పాన్ ఇండియా మూవీ లైగర్ ని ప్రొడ్యూస్ చేస్తోంది. మరి పూరి – ఛార్మిల రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.