దక్షినాది సీనియర్ నటి కస్తూరి.. పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమా ద్వారా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. అన్నమయ్య సినిమాకంటే ముందు.. ఆ తర్వాత కస్తూరి చాలా సినిమాలే చేసింది. కానీ అన్నమయ్య సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఫామ్ లో ఉన్నప్పుడు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ సీనియర్ నటి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియల్ నటిగా రాణిస్తోంది. అయితే.. సినిమా ఇండస్ట్రీ అంటే వివాదాలు, విమర్శలు ఎదురవ్వడం కామన్. అందులోను ఎన్నో గ్లామర్ రోల్స్ చేసిన నటి.. అంటే ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయడం సహజమే. అదీగాక కస్తూరికి వివాదాలలో చిక్కుకొని వార్తల్లో నిలవడం మాములే.గత కొంతకాలంగా కస్తూరి గతంలో చేసిన ఓ బోల్డ్ ఫోటోషూట్ వివాదం పై విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఆ ఫోటోషూట్ వివాదం పై స్పందించింది. కస్తూరి మాట్లాడుతూ.. ‘ఓ అమెరికా ప్రాజెక్ట్ కోసం తల్లి బిడ్డకు పాలిచ్చే ఫోటోషూట్ చేశాను. కానీ మాతృత్వానికి అమెరికా వాళ్లిచ్చే మర్యాద వేరు.. మనం ఇచ్చే మర్యాద వేరు. కానీ ఆ ఫొటోస్ ఎలా లీక్ అయ్యాయో నాకు అర్ధం కాలేదు. చాలా బాధపడ్డాను. మనవాళ్ళు అలాంటి ఫోటోషూట్స్ యాక్సెప్ట్ చేయలేరని గ్రహించాను. కానీ నాకు మహిళల నుండి భారీ మద్దతు లభించింది’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి కస్తూరి సమాధానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.