హైదరాబాద్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో రేవ్ పార్టీ, డ్రగ్స్ వెలుగు చూడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్లో ఉన్న నిహారిక, రాహుల్ సిప్లిగంజ్తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. అనవసరంగా తన పేరు ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తోన్న కొన్ని మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె ఆదివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చారు.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో నిహారికకు నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు!
ఈ సందర్భంగా నటి హేమ మీడియాతో మీట్లాడారు. ‘‘నేను అసలు పబ్కే వెళ్లలేదు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు కదా. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. నేను పబ్లో లేకున్నా.. కొందరు కావాలనే నా పేరుని ప్రసారం చేస్తున్నారు. అనవసరంగా నన్ను బద్నాం చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చాను’’ అని తెలిపారు. హేమ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.