Actor Rajasekhar: యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శేఖర్’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించి మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలి మ్యాన్గా కనిపించిన రాజశేఖర్ తన నటనతో మెప్పించారు. ఫ్యామిలీ సెంటిమెంట్తో సినిమా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే, ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకెళుతున్న ఈ సినిమాకు బ్రేక్ పడింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి సిటీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విచారణ జరిపిన కోర్టు డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
కానీ, ఆయన డబ్బు చెల్లించకపోవడంతో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది కుట్రపూరితంగా తన సినిమాను ఆపుతున్నారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఆ స్టేట్మెంట్లో.. ‘‘ నాకు, నా కుటుంబానికి శేఖర్ సినిమానే అంతా. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి మేము ఎంతో కష్టపడ్డాం. శేఖర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయినప్పటికి, ఈ రోజు ఆ సినిమాను కొంతమంది కుట్రపూరితంగా థియేటర్లలోనుంచి తీసేయిస్తున్నారు.. ఆడకుండా చేస్తున్నారు. నాకేం చేయాలో పాలు పోవటం లేదు. సినిమా ఆడాలని, పొందాల్సిన ప్రేక్షధరణ, ప్రశంసలు పొందుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ సినిమాకు రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన మలయాళ చిత్రం ‘జోషఫ్’కు రీమేక్గా సినిమా తెరకెక్కింది. రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్ హీరోయిన్గా చేశారు. ముస్కాన్ ఖూబ్చందనీ, శివానీ రాజశేఖర్, కిషోర్, పోసాని క్రిష్ణ మురిళి, సమీర్లు ప్రధాన పాత్రల్లో నటించారు. బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహించారు. మరి, రాజశేఖర్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
ఇవి కూడా చదవండి : Singer: ఇండస్ట్రీలో విషాదం: ప్రముఖ సింగర్ కన్నుమూత