ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కుర్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడో 2013లోనే క్రికెట్కు వీడ్కోలు పలికిన సచిన్ అంటే ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు ఎంతో అభిమానం. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ముంబై ఇండియన్స్కు మెంటర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ కరోనా కారణంగా రెండు సంవత్సరాలు సచిన్ టెండూల్కుర్ను అభిమానులు స్టేడియంలో ప్రత్యక్షంగా చూడలేకపోయారు. కానీ.. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తుండడంతో లైవ్ మ్యాచ్లను స్టేడియంలో కూర్చుని చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు దక్కింది.
ఈ క్రమంలో గురువారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కూడా కేటాయించిన సీట్లు అన్ని అభిమానులతో నిండిపోయాయి. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డగౌట్ ఇంటర్వ్యూ కోసం సచిన్ టెండూల్కుర్ స్టేడియంలోని బిగ్ స్క్రీన్పై కనిపించారు. అంతే స్టేడియం మొత్తం అరుపులు, కేకేలతో మార్మోగిపోయింది. సచిన్, సచిన్ అనే శబ్ధం స్టేడియాన్ని ఊపేసింది. పైగా మ్యాచ్లన్నీ ముంబైలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబైలోని స్టేడియాలన్ని సచిన్కు పుట్టినిల్లు లాంటివి. ఇక అలాంటి చోట సచిన్ మాటలు వినే భాగ్యం లభిస్తే ఇంకేమైన ఉంటుందా.. అభిమానం కట్టలుతెచ్చుకుంటుంది.
చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సచిన్ మాట్లాడుతున్న సమయంలో అతని మాట కూడా వినిపించనంత గట్టిగా స్టేడియం మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. సచిన్పై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఉన్న అభిమానం ఏనాటికి తరగనిది.. చెరగనిది అనే విధంగా ఉంది ఆ దృశ్యం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్ను అవుట్ చేయడం నేను చేసిన అతి పెద్ద తప్పు: షోయబ్ అక్తర్
Inaikum raja than @sachin_rt 😍🔥 pic.twitter.com/iXe45y9Unm
— Steve ♡ | MI (@Steve_xxx__) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.