ఐపీఎల్ 2022 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శుక్రవారం(ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో గెలుపోటముల కంటే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన హంగామాపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడో బంతికి ఒబెడ్ మెక్కాయ్ వేసిన హై ఫుల్ టాస్ను అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించడంతో ఈ రచ్చ జరిగింది. కెప్టెన్ పంత్.. ఇక ఆట ఆపేసి వచ్చేయాలంటూ బ్యాటర్స్ ను రమ్మనగా.. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే స్టేడియంలోకి పరిగెత్తి అంపైర్తో వాదించాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం పంత్కు మ్యాచ్ ఫీజులో 100శాతం ఫైన్ విధించింది. అలాగే శార్దూల్ ఠాకూర్, ఆమ్రే కూడా పనిష్మెంట్కు గురయ్యారు. ఈ క్రమంలో 2019లో జరిగిన ఇలాంటి ఘటనపై నెటిజన్లు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు.
‘2019లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అప్పటి సీఎస్కే కెప్టెన్ ధోని కూడా నో బాల్ విషయంలో పంత్లానే నానా హంగామా చేశాడు. సీఎస్కే గెలుపుకు 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో బెన్ స్టోక్స్ నడుం కంటే ఎత్తులో ఫుల్ టాస్ వేస్తాడు. దీన్ని ఫీల్డ్ అంపైర్ నో బాల్గా ప్రకటించకపోవడంతో డగౌట్లో ఉన్న ధోని కోపంతో ఊగిపోయి, గ్రౌండ్లోకి ఎంటరరై అంపైర్తో వాగ్వాదానికి దిగాడు’. అప్పట్లో ధోనీపై పెద్దగా చర్యలు తీసుకోనప్పటికీ, విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో సరిపెట్టింది. ఇప్పుడదే చర్చకు దారితీస్తోంది.
Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
When MS Dhoni lost his cool https://t.co/9GjQ7hJWtt via @ipl
— Naresh kumar Pradhan (@iam_naresh7) April 11, 2019
ఇది కూడా చదవండి: నో బాల్ ఘటనపై సీరియస్ అయిన ఐపీఎల్ కమిటీ! పాపం.. పంత్ బలి
అప్పుడు ధోని విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఐపీఎల్ యజమాన్యం, పంత్ ఇష్యూని మాత్రం సీరియస్గా తీసుకుంది. 100 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు, పంత్ ప్రవర్తనపై పెద్ద చర్చే నడిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంత్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ధోనికో లెక్క.. పంత్కో లెక్కా..? అంటూ ఐపీఎల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. నాడు ధోని మైదానంలోకి దూసుకొచ్చినా పట్టించుకోని మేనేజ్మెంట్.. పంత్ విషయాన్ని హైలైట్ చేసిందంటూ మండిపడుతున్నారు. ఆనాడు లేని ‘కోడ్ ఆఫ్ కాండక్ట్’ ఎలా పుట్టుకొచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఆ రోజు ధోని చేసింది కరక్టయితే ఇవాళ పంత్ చేసింది కరక్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పంత్ చేసింది కరెక్టా? కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Rishabh Pant on no-ball drama in the last over.
📸: Disney+Hotstar pic.twitter.com/x13i5r8u2g
— CricTracker (@Cricketracker) April 22, 2022
ఇది కూడా చదవండి: వీడియో: నో బాల్పై రచ్చ.. పంత్తో వాదనకు దిగిన బట్లర్