కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి ఓ శుభవార్త. అలాంటి వారికి ఓ అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. అది కూడా రంజాన్ పండగకు ప్రత్యేకంగా ఈ స్పెషల్ ఆఫర్. ఆ బంఫర్ ఆఫర్ ఏమిటంటే కేవలం రూ.786 డౌన్ పేమెంట్ తో మీరు బైక్ కోనుగోలు చేయేచ్చు. అయితే ఆఫర్ ఎక్కడ ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చూద్దాం..
రంజాన్ స్పెషల్ గా రూ.786కే కొత్త బైక్ కొనుగోలు చేయవచ్చు. బైక్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. ఈ ఆఫర్ కూడా కేవలం సూజుకీ మోటర్ సైకిల్స్ కు మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఎంపిక చేసిన డీలర్ షిప్స్ లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండోచ్చు. అందువల్ల బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు. వారి సమీపంలో సూజీకీ డీలర్ షిప్ కు వెళ్లి ఆఫర్ ఉందా లేదా అని తెలుసుకోండి. ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలు అడగండి. ఈ ఆఫర్ తో వాహన కొనుగోలు దారులు రూ.10 వేల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా సొంతం చేసుకోవచ్చు.
ఇక లోన్ విషయానికి వస్తే.. వడ్డీ రేటు 5.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అయితే వీటికి షరతులు వర్తిస్తాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయానుకునే వారికి SBI స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. ఇంకా మీరు కొన్ని మోడళ్లపై అయితే డౌన్ పేమెంట్ కూడా కట్టాల్సిన పని లేదు. SBI బ్యాంకే పూర్తిగా 100 శాతం ఫైనాన్స్ సదుపాయం ఆఫర్ చేస్తోంది. అయితే ఈ సౌకర్యం ఎంపిక చేసిన మోడళ్లకే వర్తిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.