ప్రస్తుతం ఎటుచూసినా డిజిటల్ మయమే కనిపిస్తుంది. యూపీఐ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. చిన్న బడ్డీ కొట్టు నుంచి పెద్ద షాప్ ల వరకు అన్నిచోట్ల యూపీఐ బోర్డ్స్ దర్శమిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు వెంటనే ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు డబ్బులను ట్రాన్సఫర్ చేసుకునే రోజులు వచ్చేశాయి. దీనికోసం అనేక యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసినవి రెండు.. ‘గూగుల్ పే’ మరియు ‘ఫోన్ పే’. మరి మన కోసం ఇంత టెక్నాలజీని అందుబాటులోకి వచ్చిన గూగుల్ పే, ఫోన్ పేలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది. వారు ఫ్రీ సర్వీస్ ఇస్తారా.. ఏంటో చూద్దాం..?
గూగుల్ పే, ఫోన్ పే యాప్ లను ఉపయోగించి మనం మనీ ట్రాన్సక్షన్స్ చేస్తుంటాం. ఇందుకోసం మనం ఆయా సంస్థలకు ఎలాంటి చార్జెస్ చెల్లించట్లేమ్. మరి మనకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాయి కదా? మరి వాటికీ ఆదాయం ఎలా అనేది అందరి ఆలోచన. అయితే,.. మనీ ట్రాన్సక్షన్స్ చేసినప్పుడు ప్రతి వెయ్యి రూపాయలకు.. ఆయా సంస్థలకు పావలా కమిషన్ వస్తుంది. అంటే 25 పైసలు వారికి కమిషన్ పోతుందన్న మాట. ఇది మనం చెల్లించట్లేమ్. డిజిటల్ పేమెంట్స్ రంగాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) చెల్లిస్తుంది. అయితే.. ఈ మధ్య కాలంలో ఇది నిలిపివేశారని వార్తలొస్తున్నాయి.
ఇది కూడా చదవండి: గూగుల్ పే, ఫోన్ పే కు పోటీగా టాటా పే..!
ఒకవేళ నిలిపివేసిందే అనుకుందాం.. ఏ కంపెనీ అయినా ఆదాయం లేకుండా నిరంతరం ఉచిత సర్వీసులు ఇవ్వడం కుదరదు. మరి ఎలా?. మొదట్లో గూగుల్ పే, ఫోన్ పే యాప్ లను డబ్బులు పంపడానికి మాత్రమే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు.. సినిమా టికెట్లు, రీఛార్జ్ లు, హోటల్ బుకింగ్స్, ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, క్రెడిట్ కార్డ్ బిల్.. అబ్బో ఇలా ఒకటేంటి లెక్కలేనన్నని సర్వీసులు వాడేస్తున్నాం. వీటి ద్వారా ప్రతి లావాదేవీపై.. ఆయా కంపెనీలు.. ఈ యాప్లకు కమీషన్ ఇస్తుంటాయి.. గతకొంత కాలంగా ఫోన్ పే యాప్ సర్వీస్ చార్జెస్ కూడా వసూలు చేస్తోంది. రీఛార్జ్ చేస్తే ప్లాట్ ఫామ్ చార్జెస్ పేరుతో.. రెండు రూపాయల కమిషన్ తీసుకుంటోంది.
A fresh set of data is now LIVE on PhonePe Pulse! Have a look at India’s leading digital payment trends from Q1 2022 only at https://t.co/jMJQrcnuIV#Pulse #BeatOfProgress pic.twitter.com/ewVRzuAGDB
— PhonePe (@PhonePe) April 29, 2022
A vision board is a great way to get some inspiration to manifest your goals into existence. What would you include in your #VisionBoard? pic.twitter.com/rZxmta304Z
— Google Pay (@GooglePay) March 29, 2022
అంతేకాదు.. అడ్వర్టైజ్ ద్వారా కూడా ఈ యాప్లు ఆదాయాన్ని పొందుతున్నాయి. ఉదాహరణకు ఫోన్పేలో.. గ్రాసరీస్, ఇన్సూరెన్స్, ఫుడ్ తదితర సేవలను అందిస్తుంది. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ యాప్లలో వినియోగదారులు చేసే లావాదేవీల డేటా స్టోర్ అవుతుంది. దీని ద్వారా వినియోగదారుడి షాపింగ్ అలవాట్లు, అవసరాలు తెలుస్తాయి. ఈ డేటాను వివిధ కంపెనీలకు, ప్రకటన సంస్థలు కొనుగోలు చేసాయి. ఫలితంగా పేమెంట్ యాప్లకు ఆదాయం లభిస్తుంది. ఆ డేటాను కొనుగోలు చేసిన కంపెనీలు.. వినియోగదారుడి అలవాట్లకు తగ్గట్లు ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించుకుంటాయి. ఇలా అన్ని విధాలా ఆదాయాన్ని పొందతున్నాయి.
Police rinda thappisikolluva tricks yaake beku? PhonePe nalli bike insurance padeyiri. idu kallanghadi tindashte sulabha. #RideTensionFree
Click here to get Bike Insurance on PhonePe starting at ₹1.5/Day: https://t.co/edfjoJOvSv pic.twitter.com/644IbD3RX6
— PhonePe (@PhonePe) April 29, 2022