బోల్డ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్.. 7 ఆర్ట్స్ సరయు కొత్తి చిక్కుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. గతంలో ఆమెపై సిరిసిల్లలో నమోదైన కేసు ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి సరయుపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగా ఆదివారం రాత్రి సరయును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై ఆమెను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కేసుతో బిగ్ బాస్ నిర్వాహకులకు పెద్ద చిక్కులే వచ్చాయని తెలుస్తోంది.
అదేంటి ‘బిగ్ బాస్ 5 తెలుగు సీజన్’లో మొదటి వారమే ఆమెను ఎలిమినేట్ చేశారు కదా? వాళ్లకి చిక్కులు ఏంటని అనుకుంటున్నారా? అవును.. ఎంతో హైప్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన సరయు ఊహించని విధంగా మొదటివారమే బయటకు వచ్చేసింది. ఆమె ఫాలోయింగ్ ను బిగ్ బాస్ యాజమాన్యం కరెక్ట్ గా ఉపయోగించుకోలేదు అని చాలా విమర్శలే వచ్చాయి. అసలు ఆమె ఎలిమినేషన్ కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో చాలా రచ్చ జరిగింది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ సరయు అరెస్టు.. పోలీసుల అదుపులో బోల్డ్ బ్యూటీ
అయితే సరయుకి ఇంకో అవకాశం ఇచ్చి.. ఆమె ఫాలోయింగ్ ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కొత్తగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీకి సరయుని కంటెస్టెంట్ గా పంపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంట. ఫిబ్రవరి నెల చివర్లో బిగ్ బాస్ ఓటీటీ షోను ప్రారంభించాలని భావిస్తున్న నిర్వాహకులకు ఈ వార్త పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇలా జరగడంతో వాళ్లంతా తలలు పట్టుకున్నారు. ఆమె స్థానంలో ఇంకెవరినన్నా వెతుక్కోవాలా? లేక ఈమెనే పంపాలా? అలా పంపితే మధ్యలో ఇష్యూ సీరియస్ అయితే ఏంటి పరిస్థితి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వాళ్లు హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27న ఓంకార్ హోస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ కార్యక్రమం ప్రారంభం కాబోతోందని బుల్లితెర వర్గాల్లో టాక్ బాగా నడుస్తోంది. మరి సరయు బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.