యూట్యూబ్ సెన్సేషన్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ కు 2022 ఇయర్ స్టాటింగ్ లోనే గట్టి షాక్ తగిలింది. దీప్తీ సునయన బ్రేకప్ చెప్పేసి.. తన దారి తాను చూసుకుంది. ఆ విషయంపై మొదట స్పందించని షణ్ముఖ్ జశ్వంత్ ఎట్టకేలకు తన మనసులోని మాట బయటపెట్టాడు. తన వల్ల దీప్తీ ఇప్పటికే చాలా అనుభవించినట్లు.. ఇకనైనా దీప్తీ ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు షణ్ముఖ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశాడు. దీప్తీ సునయన ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు పెట్టి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.
‘నిర్ణయం తీసుకునేందుకు తనకు సర్వాధికారులు ఉన్నాయి. ఇప్పటికే తను నా వల్ల చాలా ఒత్తిడిని అనుభవించింది. ఇకనైనా తను ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన దారులు వేరైనా ఒకరికొకరు సపోర్ట్ గానే ఉంటాం. ఈ ఐదేళ్లలో నేను ఎదిగేందుకు ఎంతో సహాయపడినందుకు నీకు కృతజ్ఞతలు. ఆనందంగా ఉండే హక్కు నీకుంది. జాగ్రత్తగా ఉండు.. ఆల్ ది బెస్ట్ దీపు’ అంటూ షణ్ముఖ్ కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టేశాడు.
బిగ్ బాస్ సీజన్ 5 వీరి బంధాన్ని ముక్కలు చేసింది అని అందరికీ తెలుసు. ‘మన బంగారం మంచిదైతే ఎదుటి వాళ్లను అనాల్సిన పని ఏముందిలెండి’ అంటూ సోషల్ మీడియాలో షణ్ముఖ్ పై సెటైర్లు వేస్తున్నారు. సిరితో కలిసి షణ్ముఖ్ చేసిన రచ్చ వల్లే ఇదంతా జరిగింది. షణ్ముఖ్ చేతులారా ఇలా చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ సైతం సీరియస్ అవుతున్నారు. ఈ ఐదేళ్లలో వారి మధ్య ఎన్నో గడవలు జరిగాయి. వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎన్నో నెలలు గడిపిన సంఘటనలు కూడా ఉన్నాయి.
కానీ, బిగ్ బాస్ హౌస్ లో జరిగింది వేరు. అతను వేరొక అమ్మాయితో ఫ్రెండ్ షిప్ అంటూ చనువుగా ఉన్నాడు. ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రచ్చ చేశారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాం అంటూ ఏడ్చేశారు. ఒక సగటు బుల్లితెర ప్రేక్షకులు సైతం వారి చర్యలను స్వీకరించలేకపోయారు. అలాంటిది ప్రేమించిన అమ్మాయి అలా ఎలా ఊరుకుంటుంది? అని సీజన్ నడుస్తున్నప్పుడే ప్రేక్షకులు ప్రశ్నించారు. వీరి బంధం బయట నిలబడటం కష్టమే అంటూ ముందే చెప్పుకొచ్చారు. చివరికి అదే నిజం అయ్యింది. షణ్ముఖ్ జశ్వంత్ తో దీప్తీ సునయన బ్రేకప్ చేసుకోవడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.