ఒకప్పుడు బాల్య వివాహాలు అధికంగా జరిగేవి. ఆడపిల్లలకు పెళ్లి వయస్సు రాకుండానే పండు ముసలి వారితో వివాహం జరిపించి వారి జీవితాలను నాశనం చేసేవారు. మరికొందరు అయితే పిల్లలకే వివాహలు జరిపించే వారు. అయితే నేటికాలంలో అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలానే ఓ పాపకు ఏడాది వయస్సులో వివాహం జరిపించారు. అయితే ఆ వివాహం జరిగిన 20 ఏళ్ల తర్వాత తాజాగా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పసితనంలో జరిగిన ఆ వివాహాన్ని కోర్టు రద్దు చేసింది. ఇంతకి ఎక్కడ ఈ ఘటన జరిగింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాజస్థాన్ లోని జోధ్ పూర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రేఖ అనే యువతికి ఏడాది వయస్సునప్పుడు ఆమె తాత చనిపోయాడు. అయితే అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరిపించాలని పెద్దలు భావించారు. దీంతో అదే గ్రామానికి చెందిన బాలుడితో రేఖకు వివాహం జరిపించారు. అయితే ఇద్దరు ఎవరి పుట్టింట్లో వారు ఉండేవారు. ప్రస్తుతం రేఖకు 20 ఏళ్లు దాటడంతో , చిన్నప్పటి పెళ్లికి కట్టుబడి ఉండాలని పెద్దలు నిర్ణయించారు. ఆ సమయంలో తాళికట్టిన అబ్బాయితోనే కాపురం చేయాలని పెద్దలు రేఖకు సూచించారు. దీని రేఖ నిరాకరించింది. అయితే దీనికి అబ్బాయి తరపు వాళ్లు ఓ కండిషన్ పెట్టారు. పెళ్లి అంగీకరించకుండా, కాపురానికి రాకుండా ఉండాలనుకుంటే తమకు రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరుకు గ్రామంలో పంచాయితీ నిర్వహించి తీర్మానం కూడా చేశారు. అయితే తమ కుటుంబానికి అంత స్థోమత లేక, తాను ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నా రేఖ.. ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. తన కథ అంత వారికి వివరించింది. దీంతో పెళ్లి రద్దు చేయాలని ఆ సంస్థ.. రేఖ తరపున కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు రేఖకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున ఈకాలంలో కూడా బాల్యవివాహాలు కొనసాగడం చాలా దారుణమని, ఇలాంటి సంప్రదాయాన్ని నిర్మూలించేందుకు అందరూ కృషి చేయాలని కోర్టు సూచిందించి. మరొకవైపు రేఖ పుట్టిన రోజు సమయానికి కోర్టు ఆమె పెళ్లిని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇకపై చదువు మీద దృష్టి పెడతానని రేఖ పేర్కోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: క్లాసులో ఉపాధ్యాయుడి పాడుపనులు.. అతడి బాధ పడలేని బాలికలు.. ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబిత్-11 మరణంతో.. కోహినూర్ వజ్రం ఎవరికి దక్కనుంది?