Viral Video: కేంద్ర స్టీల్ శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కొద్దిరోజుల క్రితం సియోనీనుంచి మండ్లాకు రోడ్డుపై వెళుతున్నారు. ఓ చోట రోడ్డు పక్కన ఆయనకు ఓ మొక్క జొన్న కంకులు అమ్మే కొట్టం కనిపించింది. ఆయనకు కంకుల్ని తినాలనిపించి తన కాన్వాయ్ని ఆపారు. కారులోంచి స్వయంగా కిందకు దిగి మొక్క జొన్న కంకులు అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ‘నాకో మూడు కంకులు కావాలి’ అని అడిగారు. ఆ వ్యక్తి సరేనని ఓ మూడు కంకుల్ని కాల్చి పక్కన పెట్టాడు. అప్పుడు మంత్రి‘ వాటికి బాగా ఉప్పు, కారం తగిలించు. తర్వాత వాటిని కాగితంలో చుట్టి ఇవ్వు’ అన్నారు. ఆ కుర్రాడు సరేనన్నాడు. ఆ తర్వాత కేంద్ర మంత్రి ‘ ఆ మూడు కంకుల ధర ఎంత’ అని అడిగారు. 45 రూపాయలని ఆ కుర్రాడు చెప్పాడు. మూడింటి ధర రూ.45 అనే సరికి కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ ఏంటి?.. 45 రూపాయలా. ఒక్కోటి ఎంత?’ అని అడిగారు. ‘ఒక్కోటి 15 రూపాయలు’ అని చెప్పాడు ఆ కుర్రాడు. కేంద్ర మంత్రి మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఏంటి? ఒక్కోటి 15 రూపాయలా’ అన్నారు. ఆ కుర్రాడు ‘‘ ఇది సాధారణ రేటు. మీరు కారులో వచ్చారు కాబట్టి ఏం ఎక్కువ చెప్పటం లేదు’ అన్నాడు. అప్పుడు మంత్రి ‘ ఇదే ప్రాంతంలో కంకులు ఉచితంగా దొరుకుతున్నాయి’ అని అన్నాడు. ఆ కుర్రాడు నవ్వి ‘ ఫ్రీగానా!.. మాకు ఒక్కోటి ఐదు రూపాయలు పడుతోంది’ అని చెప్పాడు. ఏదైతేనేం మంత్రి 45 రూపాయలు ఇచ్చి కంకుల్ని కొని, అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై నెగిటివ్ కామెంట్లు రావటం మొదలయ్యాయి. ‘కేంద్ర మంత్రి అయ్యిండి రూ. 15 పెట్టి ఓ కంకి కొనలేని స్థితిలో ఉన్నారా?.. మరి ఇంత పేద కేంద్ర మంత్రిని ఎక్కడా చూల్లేదు’ అంటూ మండిపడుతున్నారు. మరి, కంకి కొనటానికి బేరం ఆడిన కేంద్ర మంత్రిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU — Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022 ఇవి కూడా చదవండి : వీడియో: ఐదో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి! క్యాచ్ పట్టి కాపాడాడు!